నేనే విజయవాడ వస్తా తేల్చుకుందాం.. బోండాకు పిన్నెల్లి సవాల్

టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు విసిరిన సవాల్ కు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతి సవాల్ విసిరారు. బోండా ఉమ మాచర్ల రావాల్సిన అవసరం [more]

Update: 2020-03-11 14:58 GMT

టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు విసిరిన సవాల్ కు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతి సవాల్ విసిరారు. బోండా ఉమ మాచర్ల రావాల్సిన అవసరం లేదని, తానే విజయవాడ వస్తానని తేల్చుకుందామని సవాల్ విసిరారు. తాను ఎవరికి భయపడే వాడిని కాదన్నారు. టీవీల్లో ఏదేదో మాట్లాడితే మిగిలిన నేతల్లాగా తాను ఊరుకునే వాడిని కాదన్నారు. బోండా ఉమ, బుద్దా వెంకన్నలు విజయవాడకు చెందిన నేతలని, వారితో తనకు విభేదాలు ఎందుకుంటాయని ప్రశ్నించారు. వారు కాన్వాయ్ తో వస్తూ ఒక యాక్సిడెంట్ చేస్తే స్థానికంగా ప్రజలు దాడి చేశారని చెప్పారు.

Tags:    

Similar News