ఆర్టీసీ ఛార్జీలు పెంచడం లేదు.. తప్పుడు ప్రచారంపై?

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఛార్జీలను పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్టీసీ ఛార్జీలను [more]

Update: 2020-05-11 07:54 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ ఛార్జీలను పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్టీసీ ఛార్జీలను ప్రభుత్వం భారీగా పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడంపై పేర్ని నాని స్పందించారు. ఏపీలో ఆర్టీసీ ఛార్జిలను పెంచడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఆర్టీసీ బస్సులను ఏపీలో నడుపుతామన్నారు. ఛార్జీలను పెంచుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు పేర్ని నాని సూచించారు.

Tags:    

Similar News