పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ అరెస్ట్ !

కారు నడిపిన కానిస్టేబుల్ దీపక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, శర్మను అరెస్ట్ చేశారు. ఈ విషయంపై..

Update: 2022-03-13 06:29 GMT

న్యూ ఢిల్లీ : పేటీఎం వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే.. అరెస్ట్ చేసిన రోజే ఆయనను బెయిల్ పై విడుదల చేశారు. ఫిబ్రవరి 22వ తేదీన ఢిల్లీలోని అరబిందో మార్గ్ లో మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద శర్మ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కారు ఢిల్లీ సౌత్ డీసీపీ బెనితా మేరీ జైకర్ కారును ఢీ కొట్టినట్లు పోలీసులు చెప్పారు. ఆ సమయంలో కారులో డీసీపీ లేరు.

కారు నడిపిన కానిస్టేబుల్ దీపక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, శర్మను అరెస్ట్ చేశారు. ఈ విషయంపై కానిస్టేబుల్ దీపక్ కుమార్ మాట్లాడుతూ.. నాడు మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఓ కారు వేగంగా వచ్చి డ్యాష్ ఇచ్చి వెళ్లింది. దాంతో మా కారు డ్యామేజ్ అయింది. అదే విషయాన్ని డీసీపీ జైకర్ కు చెప్పాం. ఆమె సూచనల మేరకు కారు నెంబర్ ఆధారంగా మాలవీయ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు చేశాం అని తెలిపారు.
కారు నెంబర్ ఆధారంగా ఢీకొట్టిన కారు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఐపీసీ సెక్షన్ 279 కింద విజయ్ శర్మను పోలీసులు అదే రోజు అరెస్ట్ చేసి, కొద్దిసేపటికే బెయిల్ పై విడుదల చేశారు.


Tags:    

Similar News