పవన్ ను అడ్డుకున్న పోలీసులు

జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసిన తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు సంఘీభావం [more]

Update: 2020-01-20 14:13 GMT

జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసిన తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ జనసేన కార్యకర్తలకు ఆందోళనకు దిగారు. తాము ఎట్టిపరిస్థితుల్లో రాజధాని ప్రాంత రైతుల వద్దకు వెళతామని జనసేన నేత నాగబాబు తెలిపారు. మహిళలపై లాఠీ ఛార్జి చేయడం దారుణమన్నారు. లాఠీ ఛార్జిలో గాయపడిన వారిని పరామర్శించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పోలీసులు తమపై ఆంక్షలు పెడుతున్నారన్నారు.

Tags:    

Similar News