కాసేపట్లో కాకినాడకు పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కాకినాడకు రానున్నారు. ఆయన ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకు విమానంలో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన కాకినాడకు చేరుకుంటారు. [more]

Update: 2020-01-14 04:54 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు కాకినాడకు రానున్నారు. ఆయన ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకు విమానంలో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన కాకినాడకు చేరుకుంటారు. వైసీపీ కార్యకర్తల దాడుల్లో గాయపడిన జనసేన కార్యకర్తలను పరామర్శిస్తారు. కాకినాడలోనే మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించిన జనసేన కార్యకర్తలకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే కాకినాడలో 144వ సెక్షన్ అమలులో ఉందని, ఎటువంటి సభలకు, సమావేశాలకు, ఊరేగింపులకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ఇప్పటికే ప్రకటించారు.

Tags:    

Similar News