మోదీని ఒక్కసారి కలిశానంటే…వైసీపీ?

మాకు ఒక్క సీటు మాత్రమే వచ్చింది అయితే ఏంటంట? మీకు 151 సీట్లు వచ్చాయమని మేము ఊడిగం చేయాలా? అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ [more]

Update: 2019-12-03 13:07 GMT

మాకు ఒక్క సీటు మాత్రమే వచ్చింది అయితే ఏంటంట? మీకు 151 సీట్లు వచ్చాయమని మేము ఊడిగం చేయాలా? అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ ను ప్రశ్నించారు. రాయలసీమలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ మీరు తిడితే భరించాలా? తొక్కి నార తీస్తాఅని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమాజం కోసం నా బిడ్డలను సయితం వదిలేందుకు సిద్ధమన్నారు. జగన్ ఎప్పుడూ సీఎంలా ప్రవర్తిచంలేదన్నారు. గొర్రెలా తాను బతకనని, సింహంలా బతుకుతున్నానన్నారు. సింహాన్ని బలి ఇవ్వాలని చూస్తే మెడ కొరికి చంపేస్తుందన్నారు. రాయలసీమలో తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు.

టీడీపీ పని ఫినిష్….

ఎవరు వేటకొడవళ్లతో దాడి చేస్తారో చూస్తానని చెప్పారు. రాయలసీమలోని ఒక గ్రామానికి కొణిదెల ఇంటిపేరు పెట్టాననన్నారు. నిజంగా వైసీపీకి బలం లేదని పవన్ కల్యాణ్ చెప్పారు. బలం ఉండి ఉంటే విశాఖ లాంగ్ మార్చ్ కు రెండు లక్షలమంది జనం రారని చెప్పారు. తాను ప్రధానిని కలసి తాను మద్దతిస్తానంటే వైసీపీ నేతలు బయటకు రాగలరా? అని ప్రశ్నించారు. తాను అధికారం కోసం వెంపర్లాడనని అన్నారు. టీడీపీ పని ఎప్పుడో ఫినిష్ అయిందన్నారు. ఒకసారి విడిగా పోటీ చేసిన తర్వాత, అన్ని తిట్లు టీడీపీని తిట్టిన తర్వాత టీడీపీతో ఏ ముఖం పెట్టుకుని కలిసి పోటీ చేయగలమని అన్నారు. వైసీపీని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. తనకు కులాల మీద గౌరవం ఉందని, జగన్ రెడ్డి అంటే ఎందుకు బాధపడుతున్నారో తెలియదన్నారు.

Tags:    

Similar News