22న అందరూ కర్ఫ్యూ పాటించండి

తెలుగు ప్రజలకు జనసేనా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కోరినట్లుగానే ఈ నెల 22వ తేదీన అందరూ స్వచ్ఛందంగా కర్ఫ్యూను [more]

Update: 2020-03-20 11:49 GMT

తెలుగు ప్రజలకు జనసేనా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కోరినట్లుగానే ఈ నెల 22వ తేదీన అందరూ స్వచ్ఛందంగా కర్ఫ్యూను పాటించాలని పవన్ కల్యాణ్ ప్రజలను కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సూచనలను పాటించాలన్నారు. ప్రతి పౌరుడు తమంతట తామే అప్రమత్తంగా ఉన్నప్పుడే ఇటువంటి వైరస్ వ్యాప్తి చెందదన్నారు. అందుకే ఈ నెల 22 వతేదీన జనతా కర్ఫ్యూలో పాల్గొందామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News