జగన్ మాయలో పడొద్దు

సీఎం కావాలన్న కోరిక బొత్సలో ఎక్కడో ఉందని, బొత్స సత్యనారాయణ జగన్ మాయలో పడొద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. చెడ్డ వార్తలన్నింటినీ బొత్స సత్యనారాయణ [more]

Update: 2019-08-31 11:56 GMT

సీఎం కావాలన్న కోరిక బొత్సలో ఎక్కడో ఉందని, బొత్స సత్యనారాయణ జగన్ మాయలో పడొద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. చెడ్డ వార్తలన్నింటినీ బొత్స సత్యనారాయణ చేత చెప్పిస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ రెండోరోజు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. గత ప్రభుత్వంపై కోపంతో ప్రజలను శిక్ష వద్దించవద్దని కోరారు. వైసీపీ ప్రభుత్వానికి దేన్ని కూలుద్దామా? అన్న తప్ప దేనిని నిర్మిద్దామన్న ఆలోచనలో లేదన్నారు. 150 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది ప్రజలను శిక్షించడానికా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాజధాని అమరావతి నుంచి మార్చడానికి లేదన్నారు. ఇసుకతో ఆడుకున్న ఏ ప్రభుత్వం మనుగడ కొనసాగించలేదని ఆయన అన్నారు. అమరావతి మన ఆత్మగౌరవానికి ప్రతీకమన్నారు. ఎన్నికల కోసం తాను ప్రజల వద్దకు రాలేదని ఆయన చెప్పారు.

Tags:    

Similar News