ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కులాల మధ్య చిచ్చు రేపేలా మాట్లాడుతున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. అధికార, ప్రతిపక్షాలు కాపుల రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. జగన్ కాపుల రిజర్వేషన్లపై సంవత్సరానికి ఒక మాట మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అర్హులైన అన్ని వర్గాలకు రాజకీయ ఫలాలు అందాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు రిజర్వేషన్లపై కచ్చితమైన అభిప్రాయం లేదని విమర్శించారు.