బ్రేకింగ్ : బాబు దీక్షకు పోటీగా వైసీపీ ఎమ్మెల్యే?

ఇసుక కొరతకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు రేపు విజయవాడలో ధర్నా చేస్తున్నారు. అయితే చంద్రబాబు దీక్షకు పోటీగా వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి దీక్షకు దిగనున్నారు. [more]

Update: 2019-11-13 12:02 GMT

ఇసుక కొరతకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు రేపు విజయవాడలో ధర్నా చేస్తున్నారు. అయితే చంద్రబాబు దీక్షకు పోటీగా వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి దీక్షకు దిగనున్నారు. తనను ఇసుక అక్రమ రవాణా కేసులో ఇరికిస్తూ టీడీపీ ఛార్జి షీటు విడుదల చేసిందని, ఈ సాయంత్రంలోగా తగిన ఆధారాలు చూపాలని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి డిమాండ్ చేశారు. సాయంత్రంలోగా తగిన ఆధారాలు చూపించకపోతే రేపు చంద్రబాబు దీక్ష పక్కనే తాను కూడా దీక్షకు దిగుతానని పార్థసారధి చెప్పారు. ఈ మేరకు ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు. తనకు కూడా దీక్ష చేసేందుకు ధర్నా చౌక్ లో అనుమతించాలని కోరుతూ పార్థసారధి పోలీస్ కమిషనర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News