తెలంగాణాలో పెరుగుతున్న కేసులు.. ఈసారి వారి వల్లనే?

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా మరో 41 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1367కు [more]

Update: 2020-05-14 02:05 GMT

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా మరో 41 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1367కు చేరుకుంది. వీటిలో పది మంది వలస కార్మికులు కాగా, మిగిలిన 31 మంది గ్రేటర్ హైదరాబాద్ లోనివే. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 34 మంది మృతి చెందారు. రాష్ట్రానికి రాకపోకలు ఎక్కువవ్వడంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. వలస కార్మికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు చేరుకుంటుండటమే కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమంటున్నారు. తెలంగాణలో మే 29వ తేదీ వరకూ లాక్ డౌన్ ఉంటుందని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News