భారత్ లో బాగా కంట్రోల్ లోకి వచ్చిన కరోనా

భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 11,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 84 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

Update: 2021-02-08 06:00 GMT

భారత్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 11,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 84 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,38,194 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,55,080 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,48,606 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,05,34,505 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News