ఆ వాహనాలపై నిషేధం లేదు

పెట్రోల్, డీజిల్ వాహనాలు యదావిధిగా నడుస్తాయని, వాటిపై ఎటువంటి నిషేధం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఆటో మొబైల్ రంగం ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజల్లో [more]

Update: 2019-09-05 10:58 GMT

పెట్రోల్, డీజిల్ వాహనాలు యదావిధిగా నడుస్తాయని, వాటిపై ఎటువంటి నిషేధం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఆటో మొబైల్ రంగం ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజల్లో ఈ అపోహ ఉందన్నారు. కాని ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధించే ఆలోచనలేదన్నారు. గురువారం ఇండియన్ ఆటో మొబైల్ మానుఫ్యాక్చర్ సొసైటీ వార్షిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించే యోచనలోఉన్నామని, గ్లోబల్ ఎకానమీ కారణంగా ఆటోరంగం సంక్షోభంలో ఉందన్నారు గడ్కరీ. దీనిపై కూడా ఆర్థికశాఖతో సంప్రదింపులు జరిపిపరిస్థితిని అదుపులోకి తెస్తామన్నారు.

Tags:    

Similar News