నిమ్మగడ్డ నియామకం… అర్ధరాత్రి ఆదేశాలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి ఈ ఉత్తర్వులు వెలువడటం విశేషం. హైకోర్టు [more]

Update: 2020-07-31 02:51 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి ఈ ఉత్తర్వులు వెలువడటం విశేషం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను నియమిస్తున్నట్లు గవర్నర్ పేరిట ప్రకటన విడుదల అయింది. దీనికి సంబంధించిన గెజిట్ ను పంచాయతీ రాజ్ శాఖ విడుదల చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News