నిమ్మగడ్డ లేఖను లీక్ చేసింది ఆయనేనట

నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఓ మాజీ మంత్రి, టీడీపీ నుంచి బయటకు వెళ్లి ఢిల్లీలో ఉన్న ఓ నేత ఈ [more]

Update: 2020-03-21 06:48 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఓ మాజీ మంత్రి, టీడీపీ నుంచి బయటకు వెళ్లి ఢిల్లీలో ఉన్న ఓ నేత ఈ లీకుకు కారణమని ఏపీ పోలీసులు గుర్తించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ లీకుపై ఏపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియాకు ఈ లేఖను అందించింది ఓ మాజీ మంత్రి అని నిర్ధారణకు వచ్చారు. ఆయన ధృవీకరించిన తర్వాతనే మీడియాలో ఈ లేఖ ప్రచురితమయిందని పోలీసులు గుర్తించారు. కొన్ని మీడియా సంస్థలకే ఈ లేఖ అందించడం కూడా పోలీసు విచారణలో స్పష్టమయింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖపై దర్యాప్తు చేయాలని వైసీపీ ఎమ్మెల్యేలు డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దీనిపై ఏపీ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. దీనిపై త్వరలో ఏపీ పోలీసులు ప్రకటన చేసే అవకాశముంది.

Tags:    

Similar News