బ్రేకింగ్ : నిమ్మగడ్డ లేఖలో మరో ట్విస్ట్.. ఆ లేఖ అక్కడ కాదట

మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ ఎన్నికల కమిషన్ కార్యాలయంలో తయారు కాలేదని సీఐడీ తేల్చింది. ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఈ [more]

Update: 2020-05-05 07:07 GMT

మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ ఎన్నికల కమిషన్ కార్యాలయంలో తయారు కాలేదని సీఐడీ తేల్చింది. ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఈ విషయం వెల్లడయింది. రమేష్ కుమార్ హోంశాఖకు రాసిన లేఖ బయట నుంచి తయారు చేశారని తేల్చారు. ల్యాప్ ట్యాప్, డెస్క్ ట్యాప్ లను పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. ఈ లేఖ ఎక్కడ తయారయిందన్న విషయాన్ని త్వరలో తేలుస్తామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు. నిమ్మగడ్డ రాసిన లేఖ కార్యాలయంలో తయారు కాలేదని తేలడంతో నిమ్మగడ్డ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. లేఖ ముందే తయారై బయటనుంచి వచ్చిందని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News