తాను అవినీతి పరుడినే అయితే ఇన్ని ఐటీ కంపెనీలు ఏపీకి ఎందుకు వస్తాయని మంత్రినారా లోకేష్ ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ లపై ఆయన సెటైర్లు వేశారు. కాపు రిజర్వేషన్లపై జగన్ ఎప్పుడు ఏం మాట్లాడారో అందరికీ తెలుసన్నారు. పవన్ కల్యాణ్ తనపై ఎందుకు అవినీతి ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అందుకే అనుభవమున్న వాళ్లు రాష్ట్రాన్ని పాలించాలని లోకేష్ సెటైర్ వేశారు.