బ్రేకింగ్ : టీడీపీ నేతలపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబును మోసం చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్లేనని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న [more]

Update: 2019-05-28 06:38 GMT

చంద్రబాబును మోసం చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్లేనని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పార్టీ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు 10 శాతం మోసం చేస్తే తమ పార్టీ నేతలే 90 శాతం మోసం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. గల్లా జయదేవ్ వంటి నేతలు గెలవగా లేనిది మిగతా వాళ్లు ఎందుకు ఓడిపోయారో ఆలోచించుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అధికార పార్టీని ఆయన హెచ్చరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు టీడీపీ దక్కించుకునేలా ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News