హైదరాబాద్ బ్రాండ్ ను దెబ్బతీశారు: లోకేష్ ఫైర్

ఐటీ కంపెనీ నుంచి డేటా దొంగలించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. హైకోర్టు సాక్షిగా దొర గారి దొంగతనం బయటపడిందని, [more]

Update: 2019-03-04 07:13 GMT

ఐటీ కంపెనీ నుంచి డేటా దొంగలించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. హైకోర్టు సాక్షిగా దొర గారి దొంగతనం బయటపడిందని, తెల్ల కాగితాలపై వీఆర్ఓ సంతకాలతో అడ్డంగా దొరికిపోయారని కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబును ఎదుర్కునే దమ్ము లేక ఐటీ కంపెనీలపై దాడి చేసి ఉద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపోయిందని పేర్కొన్నారు. పోలీసులను ఉపయోగించుకొని టీడీపీ డేటాను చోరీ చేసి వైసీపీకి అప్పగించారని ఆరోపించారు. కానీ, చంద్రబాబు పట్ల ప్రజల నమ్మకాన్ని, ఆశలను మాత్రం వారు దొంగలించగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆంధ్రా వ్యతిరేక శక్తులు ఒక్కటవుతున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు.

Tags:    

Similar News