రేపు చంద్రబాబు తరుపున....?

Update: 2018-09-20 13:02 GMT

ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నాన్ బెయిల్ బుల్ వారెంట్ పై రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరుపున న్యాయవాదులు రీకాల్ పిటీషన్ వేయనున్నారు. బాబ్లీ ప్రాజెక్టు సందర్భంగా 2008లో చంద్రబాబు మరికొందరు టీడీపీ నేతలపై కేసు నమోదయిన సంగతి తెలిసిందే. దాదాపు 21 సార్లు సమన్లు జారీ చేసినా కోర్టుకు హాజరుకాకపోవడంతో ధర్మాబాద్ కోర్టు సీఎం చంద్రబాబుతో సహా మరో 12 మందికి కోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్లు జారీ చేసింది. దీనిపై తాను హాజరయ్యే కన్నా రీకాల్ పిటీషన్ వేయాలన్న న్యాయనిపుణుల సూచన మేరకు రేపు ధర్మాబాద్ హైకోర్టులో చంద్రబాబు తరుపున రీకాల్ పిటీషన్ వేయనున్నారు. మిగిలిన నేతలు కూడా ఇదే విధంగా రీకాల్ పిటీషన్ వేయనున్నారు.

Similar News