జగన్ ఫ్యామిలీకి చుక్కెదురు

వైయస్ విజయమ్మతో పాటుగా షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్నికలక కేసుకు సంబంధించి ఫిబ్రవరి 14వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది . [more]

Update: 2020-01-31 01:42 GMT

వైయస్ విజయమ్మతో పాటుగా షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్నికలక కేసుకు సంబంధించి ఫిబ్రవరి 14వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది . పరకాల లో జరిగిన ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో వైఎస్ విజయమ్మతో పాటుగా షర్మిల పైన కేసులు నమోదయ్యాయి. ఇదే కేసులో కొండా మురళి తోపాటు కొండా సురేఖ పైన కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి ప్రత్యేక కోర్టు నాంపల్లి కి అన్ని కేసులను బదిలీ చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొండా సురేఖ దంపతులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు . అయితే ఈ నెలలో వైఎస్ విజయమ్మ షర్మిల కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇద్దరికీ కూడా సమాన్లు అందకపోవడంతో మరొకసారి సమన్లు జారీ చేయాలని కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈమేరకు నాంపల్లి కోర్టు వై.ఎస్.విజయమ్మ షర్మిల కోసం సమన్లు జారీ చేసింది. విజయవాడలో ఉన్న వైఎస్ విజయమ్మ షర్మిలకు స్వయంగా నాంపల్లి కోర్టు అధికారులు సమన్లు అందజేయనున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన ఇద్దరూ తప్పకుండా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.

Tags:    

Similar News