సాగర్ లో బీజేపీకి రెబల్స్ బెడద.. బీజేపీ నేత టీఆర్ఎస్ లోకి జంప్?

నాగార్జున సాగర్ బీజేపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ కడారి అంజయ్య టీఆర్ఎస్ వైపు చేరుతున్నారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ ను అంజయ్య కలవనున్నారు. అంజయ్య తనకు టిక్కెట్ [more]

Update: 2021-03-30 07:41 GMT

నాగార్జున సాగర్ బీజేపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ కడారి అంజయ్య టీఆర్ఎస్ వైపు చేరుతున్నారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ ను అంజయ్య కలవనున్నారు. అంజయ్య తనకు టిక్కెట్ కావాలని ప్రయత్నం చేశారు. యాదవ సామాజికవర్గానికి చెందిన అంజయ్యకు టిక్కెట్ ఇవ్వకుండా చివరి నిమిషంలో రవికుమార్ కు టిక్కెట్ కేటాయించారు. దీంతో కడారి అంజయ్య బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. గతంలో స్వతంత్రంగా పోటీ చేసి అంజయ్య పాతిక వేల కు పైగానే ఓట్లు సంపాదించుకున్నారు.

Tags:    

Similar News