అక్టోబరు వరకూ ప్రభుత్వానికి డెడ్ లైన్

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం పేరిట మోసం జరుగుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏపీలో అభివృద్ధి మచ్చుకైనా కన్పించడం లేదన్నారు. ఇందుకు [more]

Update: 2021-08-27 05:56 GMT

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం పేరిట మోసం జరుగుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏపీలో అభివృద్ధి మచ్చుకైనా కన్పించడం లేదన్నారు. ఇందుకు ఏపీలోని రహదారుల దుస్థితిని చూస్తే అర్థమవుతుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. సెప్టంబరు 2,3,4 తేదీల్లో ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన ప్రచారం చేస్తుందన్నారు. అక్టోబరు నాటికి రోడ్లను బాగు చేయకపోతే జనసేన బాగు చేస్తుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇప్పటికైనా వైసీీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు.

Tags:    

Similar News