ముద్రగడ నిర్ణయం నేడే

కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నాయకులు నేడు ముద్రగడ పద్మనాభం ఇంట్లో భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి ముద్రగడ పద్మనాభం [more]

Update: 2020-09-21 02:50 GMT

కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నాయకులు నేడు ముద్రగడ పద్మనాభం ఇంట్లో భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం నుంచి ముద్రగడ పద్మనాభం తప్పుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనే తమ ఉద్యమ నేత అని కాపు నేతలు ప్రకటించారు. ఈరోజు సమావేశమై తిరిగి ఉద్యమానికి నాయకత్వం వహించాలని ముద్రగడ పద్మనాభంను కాపునేతలు కోరనున్నారు. మరి ముద్రగడ పద్మనాభం ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Similar News