బ్రేకింగ్ : ఎమ్మార్వో దారుణ హత్య

అబ్దుల్లా పూర్ మెట్ఎమ్మార్వో విజయారెడ్డిపై సురేష్ అనే యువకుడు దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా పెట్రోలు పోసి నిప్పంటించడంతో ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనమయ్యారు. ఎమ్మార్వో [more]

Update: 2019-11-04 11:08 GMT

అబ్దుల్లా పూర్ మెట్ఎమ్మార్వో విజయారెడ్డిపై సురేష్ అనే యువకుడు దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా పెట్రోలు పోసి నిప్పంటించడంతో ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనమయ్యారు. ఎమ్మార్వో విజయారెడ్డి మృతితో రెవెన్యూ సంఘాలు ఆందోళనకు దిగాయి. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నాయి. ఒక భూవివాదంలో సురేష్ అనే యువకుడు ఎమ్మార్వో ను హత్య చేసినట్లు తెలుస్తోంది. విజయారెడ్డి గత నాలుగేళ్లుగా అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో గా పనిచేస్తున్నారు. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి మరీ నిప్పంటించడంతో ఆమె కేకలు వేసింది. ఈ కేకలు విని ఆమె డ్రైవర్ లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించగా తలుపులు మూసి వేసి ఉన్నాయి. తలుపులు బద్దలు కొట్టి చూడగా ఎమ్మార్వో సజీవదహనయి ఉండటాన్ని గుర్తించారు. ఘటనకు పాల్పడిన సురేష్ కూడా గాయాలు పాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News