ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న మంత్రి వాహనం

Update: 2018-12-21 06:53 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవింద్ర కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. కృష్ణా జిల్లా మచిలిపట్నం రామానాయుడుపేట సెంటర్ లో ఆగివున్న ఆటోను మంత్రి కారు ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ కట్టా ప్రసాద్ కి తీవ్ర గాయాలయ్యాయి. రెండు కాళ్లు విరిగిపోవడంతో పాటు అతని తలకు బలమైన గాయమైంది. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో మంత్రి లేరు. మచిలిపట్నం హిందు కళాశాలలో ఈ రోజు రాత్రి మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు కుమార్తె(ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర మేనకొడలు) వివాహం జరగనుంది. పెళ్లి పనుల నిమిత్తం మంత్రి వాహనం ఇంటి వద్ద నుండి కళ్యాణ మండపం వరకు తిరుగుతుంది. ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి కుటుంబసభ్యుడు డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఆసుపత్రిలో ఉన్న ఆటో డ్రైవర్ ను మంత్రి పరామర్శించి మెరుగైన వైద్యం చేయాలని వైద్యులకు సూచించారు.

Similar News