స్పందించని సీఎం… బీజేపీ ఎమ్మెల్యే దీక్ష

పశ్చిమగోదావరి జిల్లాకు ఇచ్చిన 56 హామీలను నెరవేర్చాలి డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడకొండల మాణిక్యాల రావు నిరాహార దీక్షకు దిగారు. జిల్లాకు ఇచ్చిన [more]

Update: 2019-01-21 07:36 GMT

పశ్చిమగోదావరి జిల్లాకు ఇచ్చిన 56 హామీలను నెరవేర్చాలి డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడకొండల మాణిక్యాల రావు నిరాహార దీక్షకు దిగారు. జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఇప్పటికే ఆయన తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపించి అల్టిమేటం ఇచ్చారు. అయినా ముఖ్యమంత్రి స్పందించకపోవడంతో ఇవాళ తాడేపల్లిగూడెంలో ‘ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల సాధనకై పోరుబాట’ పేరుతో నిరాహార దీక్ష ప్రారంభించారు. జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు దీక్ష విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News