టీడీపీ నేత వద్ద రూ.55 కోట్లు....!!

Update: 2018-12-09 04:42 GMT

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వ్యాపార కేంద్రాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చైన్నై లో జరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటికే 55 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. చెన్నైలోని ఆయనకు చెందిన బాలాజీ గ్రూపు, ఎండ్రికా ఎంటర్ ప్రైజెస్ డిస్టలరీస్ వంటి కార్యాలయాల్లో ఈ సోదాలు నేడు కూడా జరుగుతున్నాయి. ఒక వ్యక్తి ఇచ్చిన పక్కా సమాచారం మేరకే ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశముంది. కిలోల కొద్దీ బంగారం, వెండిి కూడా ఈసోదాల్లో లభించాయని చెబుతున్నారు.

Similar News