కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి ఎల్వీ..?

ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు త్వరలో జారీ చేయనున్నట్లు [more]

Update: 2019-12-16 04:22 GMT

ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు త్వరలో జారీ చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం ఎల్వీ సుబ్రహ్మణ్నాన్ని కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోనున్నారు. ఇటీవల ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఏపీ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సెలవుపై వెళ్లారు. మరి కొద్ది నెలలు మాత్రమే సర్వీసు ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News