టీడీపీ దొంగ దెబ్బతీసింది… ఒక్క రూపాయి కూడా తీసుకోలేని పరిస్థితి

శాసనమండలి చరిత్రలో ఎప్పుడూ జరగని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత సభలోనూ స్వయంగా చంద్రబాబు మండలి గ్యాలరీ [more]

Update: 2020-06-17 15:00 GMT

శాసనమండలి చరిత్రలో ఎప్పుడూ జరగని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గత సభలోనూ స్వయంగా చంద్రబాబు మండలి గ్యాలరీ లో కూర్చుని ఛైర్మన్ ను ఇన్ ఫ్లూయెన్స్ చేశారని చెప్పారు. ద్రవ్య బిల్లును కూడా ఆమోదించకుండా వెళ్లిపోవడం అంటే టీడీపీ ఎంత అప్రజాస్వామ్యకంగా వ్యవహరిస్తుందో తెలియజేస్తుందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. టీడీపీ చెప్పినట్లుగా సభ నడవాలని చూశారన్నారు. బడ్జెట్ ను ఆమోదించకపోతే ఉద్యోగాలు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. శాసనమండలిలో ఈ బిల్లు పాస్ కాకుంటే ఒక్క రూపాయి కూడా ఖజానా నుంచి డ్రా చేయలేమని చెప్పారు. ఆర్థిక మంత్రి ఎంత వేడుకున్నా వారు కనికరించకుండా నిరవధిక వాయిదా వేసుకుని వెళ్లిపోయారన్నారు.

Tags:    

Similar News