బ్రేకింగ్ : కర్నూలు కొంప ముంచేటట్లుందే?

ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లా కరోనా వైరస్ కు ఎక్కువగా ప్రభావితం అయ్యేట్లు కన్పిస్తుంది. ఒక్కరోజే కర్నూలు జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా నుంచి [more]

Update: 2020-04-05 05:44 GMT

ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లా కరోనా వైరస్ కు ఎక్కువగా ప్రభావితం అయ్యేట్లు కన్పిస్తుంది. ఒక్కరోజే కర్నూలు జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకూ 27 కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 226కు పెరిగింది. ఒక్కరోజే34 పాజిటివ్ కేసులు వచ్చాయి. కొత్తగా నమోదయిన కేసుల్లో కర్నూలు జిల్లాలో 23, చిత్తూరు లో ఏడు, ప్రకాశం, నెల్లూరులో రెండు చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరికొందరి రక్తనమూనాల నివేదికలు ఇంకా అందాల్సి ఉంది.

Tags:    

Similar News