సైంటిస్టులా పెద్ద పోజులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి కన్న బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై దుష్ప్రచారం చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారన్నారు. ఎన్ 440 కే వేరియంట్ [more]

Update: 2021-05-10 01:17 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి కన్న బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై దుష్ప్రచారం చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారన్నారు. ఎన్ 440 కే వేరియంట్ పై అబద్ధపు ప్రచారాలు చేసి చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని కన్న బాబు ఆరోపించారు. చంద్రబాబే రాష్ట్రానికి పట్టిన వైరస్ అని కన్న బాబు అన్నారు. ముఖ్యమంత్రికి ప్రజల్లో చెడ్డపేరు తెచ్చేందుకు విషం చిమ్ముతున్నారని కన్న బాబు అన్నారు. తాము వైరస్ ను ఎదుర్కొనాలా? చంద్రబాబు దుష్ప్రచారాన్ని ఎదుర్కొనాలా? అన్నది సందేహంగా మారిందన్నారు. జూమ్ లో కూర్చుని సైంటిస్ట్ లా చంద్రబాబు పోజులు కొడుతున్నారని కన్నబాబు ఆరోపించారు

Tags:    

Similar News