వారంతా మూల్యం చెల్లించకోక తప్పదు.. కూన హెచ్చరిక

అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి పార్టీని వీడుతున్నవారు భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ నేత కూన రవికుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా కూన [more]

Update: 2021-03-02 01:05 GMT

అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి పార్టీని వీడుతున్నవారు భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ నేత కూన రవికుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా కూన రవికుమార్ మంత్రి అప్పలరాజుపై మండిపడ్డారు. అధికారం ఉంది కదా? అని విర్రవీగితే భవిష్యత్ లో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. ధైర్యం ఉంటే మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసి గెలవాలని మంత్రి అప్పలరాజుకు కూన రవికుమార్ సవాల్ విసిరారు. తమ పార్టీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసి వైసీపీలో చేరిన వారు అనర్హులవుతారని, దీనిపై ఎన్నికల కమిషన్ ను ఆశ్రయిస్తామని కూన రవికుమార్ చెప్పారు.

Tags:    

Similar News