కుమార ఆవేదన చూశారా…?

తాను ఎన్నడూ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాకులాడలేదని, దానంతట అదే తన వద్దకు వచ్చిందని కర్ణాటక ముఖ్మమంత్రి కుమారస్వామి తెలిపారు. ఈరోజు విశ్వాసంపై చర్చ సందర్భంగా కుమారస్వామి [more]

Update: 2019-07-19 07:34 GMT

తాను ఎన్నడూ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాకులాడలేదని, దానంతట అదే తన వద్దకు వచ్చిందని కర్ణాటక ముఖ్మమంత్రి కుమారస్వామి తెలిపారు. ఈరోజు విశ్వాసంపై చర్చ సందర్భంగా కుమారస్వామి మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ పై కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయిందన్నారు. దీనికి కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. కోట్లాది రూపాయలు ఆఫర్ చేస్తుంటే ఎలా కాపాడుకోగలుగుతామని కాంగ్రెస్ నేతలు తిరిగి ప్రశ్నించారు. కుమారస్వామి మాట్లాడుతూ ఈరోజు కాకుంటే రేపయినా ప్రభుత్వాన్ని ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. తాను ముఖ్యమంత్రి పదవిని దుర్వినియోగం చేయనన్నారు. సోమ, మంగళవారం వరకూ ఓపిక పట్టాలని ఆయన పరోక్షంగా బీజేపీ సభ్యులకు సూచించారు.

Tags:    

Similar News