వచ్చే రెండు వారాలు కీలకం

వచ్చే రెండు వారాలు కీలకమని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కరోనా తెలంగాణలో నియంత్రణలోకి వస్తుందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే సానుకూల ఫలితాలను ఇస్తుందన్నారు. [more]

Update: 2021-05-13 01:22 GMT

వచ్చే రెండు వారాలు కీలకమని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కరోనా తెలంగాణలో నియంత్రణలోకి వస్తుందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే సానుకూల ఫలితాలను ఇస్తుందన్నారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో రెమిడిసివర్ ఇంజక్షన్ల వినియోగంపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో పడకల సంఖ్య ను పెంచామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో 1.5 లక్షల రెమిడెసివర్ ఇంజక్షన్ల నిల్వలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ఈ రెండు వారాలు ప్రజలు అప్రమత్తంగా ఉంటే కరోనా నుంచి బయటపడగలమని కేటీఆర్ చెప్పారు.

Tags:    

Similar News