కొండా వెంట ఎవరెవరు?

Update: 2018-11-21 03:59 GMT

చేవెళ్ల టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి మరికొద్దిసేపట్లో రాహుల్ ను కలవనున్నారు. నిన్న పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి ఈ నెల 23న మేడ్చల్ లో జరిగే సోనియాగాంధీ పాల్గొనే బహిరంగసభలో హస్తం కండువాను కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాతో కలసి రాహుల్ ను కలసి తాను టీఆర్ఎస్ ను వీడటానికి గల కారణాలను వివరించనున్నారు. అదేరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా ఆ పార్టీని వీడి కొండా బాటనే నడవనున్నారని తెలుస్తోంది. మొత్తం మీద కొండా వెంట మరికొంత మంది ఎంపీలు కూడా నడుస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మరి ఎన్నికల వేళ ఎవరు ఉంటారో? ఎవరు వెళతారో చూడాల్సి ఉంది.

Similar News