తామే ఖర్చు భరిస్తాం… అమ్ముడు పోవద్దు

తామే ఎన్నికల ఖర్చు భరిస్తామని, గెలిచిన తర్వాత ఇతర పార్టీలకు అమ్ముడు పోవద్దని మాజీ మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో నమ్మక ద్రోహం సరికాదని [more]

Update: 2021-04-17 01:22 GMT

తామే ఎన్నికల ఖర్చు భరిస్తామని, గెలిచిన తర్వాత ఇతర పార్టీలకు అమ్ముడు పోవద్దని మాజీ మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో నమ్మక ద్రోహం సరికాదని కొండా సురేఖ తెలిపారు. అమ్ముడుపోయిన వారు కన్నతల్లిని అమ్ముకున్నట్లేనని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. తామే ఖర్చు పెడతామని, గెలుపుకు కృషి చేస్తామని కొండా సురేఖ తెలిపారు. అభ్యర్థులు ఆర్థికంగా కూడా బలంగా ఉంటేనే గెలుపు సాధ్యమవుతుందని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో కార్పొరేషన్ ఎన్నికలు పెట్టడమేంటని ఆమె ప్రశ్నించారు.

Tags:    

Similar News