హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయం

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ ను ఓడించేందుకు కేసీఆర్ కుటుంబం అనేక కుట్రలు చేస్తుందన్నారు. [more]

Update: 2021-08-20 12:36 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ ను ఓడించేందుకు కేసీఆర్ కుటుంబం అనేక కుట్రలు చేస్తుందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా చివరకు హుజూరాబాద్ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ చేసే జిమ్మిక్కులను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News