కిడారి కుమారులకు బాబు భరోసా

Update: 2018-09-28 07:26 GMT

మావోయిస్టుల చేతలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు కుమారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కున చేర్చుకున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం పాడేరు చేరుకుని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కిడారి సర్వేశ్వరరావుకు నివాళులర్పించారు. కిడారి సర్వేశ్వరరావుకు ఇద్దరు కుమారులున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారిద్దరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారిని ఓదార్చారు. వారి భవిష్యత్తును తాను చూసుకుంటానని చెప్పారు. సోమ కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు పరామర్శించనున్నారు.

Similar News