Kerala : భారీ వర్షాలు… శబరిమలకు రావద్దు

కేరళను వరదలను చుట్టుముట్టాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షాలకు ఇప్పటి వరకూ 11 మంది మృతి [more]

Update: 2021-10-17 08:56 GMT

కేరళను వరదలను చుట్టుముట్టాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షాలకు ఇప్పటి వరకూ 11 మంది మృతి చెందారు. భద్రతాదళాలు రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. ఇప్పటి వరకూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పన్నెండు మంది ప్రాణాలను రక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

కోవిడ్ నిబంధనలతో…..

కేరళలో కురుస్తున్న భారీ వర్షాలను కేంద్ర హోంశాఖ సమీక్షిస్తుంది. కోవిడ్ నిబంధనలతో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా శబరిమలకు భక్తులు రావద్దని కేరళ ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Tags:    

Similar News