గ్రామాల అభివృద్ధి దిశగా

గత ఐదేళ్ల కాలం నుంచి ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. గోల్కొండ కోటలో జరిగిన 73వ స్వాతంత్ర్య వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. గ్రామాలను [more]

Update: 2019-08-15 05:45 GMT

గత ఐదేళ్ల కాలం నుంచి ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. గోల్కొండ కోటలో జరిగిన 73వ స్వాతంత్ర్య వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం సానుకూల థృక్ఫథంతో ముందుకు వెళుతుందని చెప్పారు. గ్రామాలను అభివృద్ధి చేయడానికి 60 రోజులు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పచ్చదనాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ను తక్కువ కాలంలో పూర్తి చేసి బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకునే దిశగా పయనిస్తున్నామని చెప్పారు.

Tags:    

Similar News