రేపు కేబినెట్ భేటీ.. అందుకేనట

రేపు తెలంగాణ మంత్రి వర్గం సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచి [more]

Update: 2021-07-31 03:10 GMT

రేపు తెలంగాణ మంత్రి వర్గం సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ పథకానికి మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేయనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా రూపొందించడంతో కేసీఆర్ వీలయినంత త్వరగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. అందుకోసమే మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారంటున్నారు.

Tags:    

Similar News