అందుకే వారంతా టీఆర్ఎస్ లోకి వస్తున్నారు

ప్రజా సంక్షేమంలో భాగస్వామ్యం కావడానికే టీఆర్ఎస్ లో అనేక మంది నేతలు చేరుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీజేపీ నేత పెద్దిరెడ్డిని ఆయన కండువా కప్పి [more]

Update: 2021-07-30 12:31 GMT

ప్రజా సంక్షేమంలో భాగస్వామ్యం కావడానికే టీఆర్ఎస్ లో అనేక మంది నేతలు చేరుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీజేపీ నేత పెద్దిరెడ్డిని ఆయన కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. పెద్దిరెడ్డి తనకు సన్నిహిత మిత్రుడన్నారు. దళిత బంధు పథకం ఏడాది క్రితమే ప్రారంభం కావాల్సి ఉన్నా, కరోనా కారణంగా వాయిదా పడిందని కేసీఆర్ తెలిపారు. పథకాల అమలులో తెలంగాణ ముందందుని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఇప్పటికీ ధనిక రాష్ట్రమేనని చెప్పారు. తెలంగాణ ఉద్యమం చివర్లో వచ్చి తూ తూ మంత్రంగా పాల్గొన్న వారు సయితం ఈరోజు నానా రకాలుగా మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు. ఎవరు ఏమి అన్నా దళిత బంధు ఆగదని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

Tags:    

Similar News