ఆ ఆలోచనే లేదు.. ఎవరూ ఆందోళన చెందొద్దు

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. మరోసారి లాక్ డౌన్ పెట్టబోమని కేసీఆర్ స్పష్టం [more]

Update: 2021-03-27 01:15 GMT

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. మరోసారి లాక్ డౌన్ పెట్టబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన సూచించారు. కరోనా విస్తరించే అవకాశమున్నందున తాత్కాలికంగానే పాఠశాలలను మూసివేశామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో కరోనా అంత తీవ్రంగా లేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అయితే ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని కేసీఆర్ కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని ప్రజలకు కేసీఆర్ సూచించారు.

Tags:    

Similar News