వెనక్కు తగ్గొద్దు జగన్.. మద్దతిచ్చిన కన్నా

పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నది బీజేపీ డిమాండ్ అన్నారు. పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థ్యం [more]

Update: 2020-05-13 07:04 GMT

పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నది బీజేపీ డిమాండ్ అన్నారు. పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థ్యం పెంచుతూ జీవో నెంబరు 203 జీవోను తాము సమర్థిస్తున్నామని చెప్పారు. పొరుగు రాష్ట్రంతో పోరాడతారో? న్యాయ పోరాటం చేస్తారో? తెలియదు కాని, ప్రాజెక్టు విషయంలో వెనక్కు తగ్గవద్దని జగన్ ను కన్నా లక్ష్మీనారాయణ కోరారు. పోతిరెడ్డి పాడు విషయంలో ఏపీ బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రభుత్వానికి ఉంటుందని ఆయన తెలిపారు.

Tags:    

Similar News