జగన్ కు కన్నా మరో లేఖ.. పరిహారంతో ప్రమాదాన్ని?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కన్నా లక్ష్మీనారాయణ మరో లేఖ రాశారు. విశాఖ గ్యాస్ లీక్ సంఘటన పూర్తిగా మానవ వైఫల్యమేనని అన్నారు. స్టెరిన్ ట్యాంక్ [more]

Update: 2020-05-11 06:08 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కన్నా లక్ష్మీనారాయణ మరో లేఖ రాశారు. విశాఖ గ్యాస్ లీక్ సంఘటన పూర్తిగా మానవ వైఫల్యమేనని అన్నారు. స్టెరిన్ ట్యాంక్ లో ఉష్ణోగ్రతలు మించిపోతున్నా కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. కంపెనీ యాజమాన్యం వైఫల్యం వల్లనే గ్యాస్ లీక్ అయందన్నారు. పరిహారంతో ప్రమాదాన్ని కప్పిపుచ్చడం సరికాదని కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. చిన్న చిన్న కేసులతో సరిపెట్టడం సరికాదన్నారు. కంపెనీ యాజమాన్యం, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యాన్ని, అధికారులను అరెస్ట్ చేయాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు.

Tags:    

Similar News