కడియం కేక ...కాక పుట్టించారే....!

Update: 2018-10-23 11:56 GMT

స్టేషన్ ఘన్ పూర్ లో సమ్మతి లేదు...అసమ్మతి లేదని తెలంగాణ రాష్ట్ర సమితి నేత కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలో రాజయ్య, తాను కలసి పనిచేస్తామని కడియం చెప్పారు. రాజయ్య అప్పుడప్పుడూ తన పట్ల తప్పుగా ప్రవర్తించినా తాను మాత్రం ఎప్పుడూ అలా ప్రవర్తించలేదన్నారు. రాజయ్య తనకు తమ్ముడు లాంటి వాడని, రాజయ్య టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుడన్నారు. భారీ మెజారిటీతో రాజయ్యను గెలిపించుకుని కేసీఆర్ కు స్టేషన్ ఘన్ పూర్ ను కానుకగా ఇవ్వాలన్నారు. స్టేషన్ ఘన్ పూర్ లో జరిగిన ప్రచార కార్కక్రమంలో కేటీఆర్ తో పాటు కడియం కూడా పాల్గొన్నారు. కాగా ఈ ప్రచార కార్యక్రమానికి కేసీఆర్ ఆదేశాలతోనే కడియం హాజరయినట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘన్ పూర్ టిక్కెట్ ఆశించిన కడియం కుటుంబం కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.

Similar News