బాబు బోడి సలహాలు మాకక్కరలేదు

ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ కార్డు కూడా లేని చంద్రబాబు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ విమర్శించారు. ఆయన బోడి సలహాలు తమకు [more]

Update: 2020-04-30 06:58 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ కార్డు కూడా లేని చంద్రబాబు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ విమర్శించారు. ఆయన బోడి సలహాలు తమకు అవసరం లేదన్నారు. హైదరాబాద్ లో కూర్చుని లేఖలు రాస్తూ, మీడియా సమావేశాలు పెడుతూ పనికి మాలిన సలహాలు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడి టీడీపీ నేతలు తానా తందానా అంటున్నారన్నారు. రాష్ట్రం విడిచి పారిపోయిన చంద్రబాబుకు తమనను విమర్శించే హక్కు లేదన్నారు. ప్రతిపక్షం ఏపీలో పనికిరాని పక్షంగా మారిందన్నారు. పేదలు ఎవరూ ఆకలితో అలమటించుకూడదని జగన్ అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. హైదరాబాద్ లో కూర్చుని చెత్త వాగుడు వాగితే ఎవరూ ఊరుకోరన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే కాసుల పంటగా మార్చుకునే వారని జోగి రమేష్ ఆరోపించారు. క్వారంటైన్ లో ఉన్న వారికి కూడా జగన్ రెండువేలు అందించారన్నారు. తాడు,బొంగరం లేని పార్టీలూ కూడా మాట్లాడుతున్నాయన్నారు.

Tags:    

Similar News