పోలీస్ స్టేషన్ కు జేసీ

అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ కు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. కొన్ని రోజుల క్రితం పోలీసుల పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై [more]

Update: 2020-01-04 07:51 GMT

అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ కు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. కొన్ని రోజుల క్రితం పోలీసుల పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదయింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చారు. నెలలో రెండుసార్లు పోలీస్ స్టేషన్ కు జేసీ దివాకర్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. కాసేపు పోలీస్ స్టేషన్లో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి తిరిగి వెళ్లిపోయారు. చంద్రబాబు అమరావతి వచ్చిన సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల చేత బూట్లు నాకిస్తానని చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News