బ్రేకింగ్ : మాజీ ఎంపీ జేసీ సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే పోలీసుల చేత బూట్లు నాకిస్తామని వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. [more]

Update: 2019-12-18 11:56 GMT

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే పోలీసుల చేత బూట్లు నాకిస్తామని వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. పోలీసులపైనే సారా, గంజాయి విక్రయాల వంటి కేసులు పెడతామన్నారు. చంద్రబాబు శాంతి శాంతి అంటూ మమ్మల్ని ముంచారన్నారు. చంద్రబాబులో కూడా మార్పు రావాలన్నారు. జగన్ మీకు అన్న, తమ్ముడా, బంధువా? అని ప్రశ్నించారు. జగన్ సంగతి తనకు ముందు నుంచి తెలుసునన్నారు. చంద్రబాబుకు జగన్ గురించి అనేక సార్లు చెప్పినా వినలేదన్నారు. రెండున్నరేళ్లకే ఎన్నికలు వస్తాయని, అప్పుడు పోలీసుల సంగతి తేల్చుకుంటామన్నారు. పోలీసులు ఐదేళ్లు కాదని, అనేక సంవత్సరాలు సర్వీసులో ఉంటారన్నారు. తమను అన్యాయంగా కేసుల్లో ఇరికించిన పోలీసులను ఎక్కడున్నా వదిలి పెట్టేది లేదని జేసీ తెలిపారు.

Tags:    

Similar News